తేదీ 24/01/2026
నేషనల్ రోడ్ సేఫ్టీ మాసోత్సవాల అవగాహన సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల అమలు పరిశీలించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఆ ప్రధమ చికిత్స బాక్సులు తప్పనిసరిగా ఉండాలని, వాటిలో కాటన్, రోలర్ బాండేజ్, డ్రెస్సింగ్ ప్యాడ్స్, పావిడిన్ అయోడిన్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసిటమోల్ ట్యాబ్లెట్లు, అడ్హెసివ్ పేపర్ ప్లాస్టర్, సర్జికల్ గ్లౌజులు వంటి ప్రాథమిక వైద్య సామగ్రిని కంపల్సరీగా ఉంచాలని ఆర్టీసీ అధికారులకు ఈ విషయమై ఆర్టీసీ మేనేజర్ గారికి స్పష్టమైన సూచనలు ఇవ్వడంతో పాటు, ప్రయాణ సమయంలో ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే ప్రాథమిక చికిత్స అందించేలా సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రయాణికుల ప్రాణ భద్రతకు రోడ్ సేఫ్టీ నిబంధనల అమలు అత్యంత ముఖ్యమని అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తో పాటు పి ఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సన జవేరియా గారు, ఆర్టీసీ అధికారులు కూడా పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ బస్సులలో ఫస్ట్ ఎయిడ్ బాక్సుల అమలు పరిశీలన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం