రాజన్న సిరిసిల్ల, జూన్ - 01
వాతావరణ సమతుల్యత.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని.. వాటిని సంరక్షించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు.
ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 1 వ తేదీ నుంచి
12 వ తేదీ వరకు పర్యావరణ ఉత్సవాలలో భాగంగా
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమీపంలో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితె, జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ సత్యనారాయణ, జిల్లా అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓ, జిల్లా అధికారులు, యువత, విద్యార్థులు మామిడి మొక్కలు నాటి.. నీటిని పోశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తమ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు.
మొక్కలు నాటడంతో ప్రస్తుతంతో పాటు భవిష్యత్ తరాలకు ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. పర్యావరణ ఉత్సవాల కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమాల్లో అందరినీ భాగస్వామ్యం చేయాలని పిలుపు నిచ్చారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, సీపీఓ శ్రీనివాసాచారి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా పంచాయతీ అధికారి షరీఫ్ఫుద్దిన్, ఉద్యానవన శాఖ అధికారి శరత్, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.