జాతీయ 108 అంబులెన్స్ పైలెట్స్ డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జిల్లా మేనేజర్ సవనపెళ్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో పనిచేస్తున్న 108 అంబులెన్స్ పైలెట్లు కలిసి కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో పైలెట్స్ డేను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ మాట్లాడుతూ, అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడేందుకు 108 పైలెట్లు రాత్రింబవళ్లు అంకితభావంతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు సమయానికి వైద్య సేవలు అందించడంలో పైలెట్ల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
పైలెట్లు కూడా తమ సేవలను మరింత బాధ్యతాయుతంగా కొనసాగిస్తూ ప్రజలకు మెరుగైన అత్యవసర సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో 108 పైలెట్ లు పెద్ది శ్రీనివాస్,బరిగె లక్ష్మణ్,మామిడాల ఆంజనేయులు, పోచంపల్లి పరశురాములు, వనపర్తి అనీల్, పంతగాని మహేష్,మొగిలి సుధాకర్, బరిగెల మనోజ్,నలికె నవీన్, నాగసముద్రం రాజశేఖర్, బండారి ప్రణయ్, చల్ల మధుసుదన్,
టెక్నీషియన్లు జలగం సత్య సాగర్, మంత్రి కిషోర్,వడ్నాల అనిల్,చల్ల సత్తయ్య, నునావత్ మధన్, పంథం సాయికృష్ణ,మినుప స్వామి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..