రాజన్న సిరిసిల్ల, మే - 26 ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సిరిసిల్ల సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
మొత్తం దరఖాస్తులు 300 వచ్చాయి.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం తోపాటు సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవో కార్యాలయాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా రెవెన్యూ డివిజన్ల
కార్యాలయాలలోనూ ప్రజావాణి కొనసాగుతుందని, స్థానిక ప్రజలు తమ అర్జీలు అందించాలని సూచించారు.
సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజేందర్ రెడ్డి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 9 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు.
వేములవాడ ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ కే ఎస్ బీ కుమారి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 12 దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందించి పరిష్కరించాలని ఆదేశించారు.
ఐడీఓసీ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు.