పెద్దపల్లి, మే 18:
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.
పెద్దపల్లి పట్టణానికి చెందిన పడాల పద్మ రెండవ కూతురు కళ్యాణ లక్ష్మి దరఖాస్తు తీసుకునేందుకు ఆధార్ నెంబర్ తీసుకోవడం లేదని దీనికి సంబంధించి సవరణ చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా మీసేవ రెవెన్యూ అధికారులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
శ్రీరాంపూర్ మండలం భీమారం పల్లి గ్రామానికి చెందిన ఎడ్ల రమ్య తమకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పిడి హౌసింగ్ అధికారికి రాస్తూ అర్హత పరిశీలించే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ముత్తారం మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన సంతోష్ కుమార్ తమ గ్రామంలోని సర్వే నెంబర్ 107/బి/2/2 లో మూడు ఎకరాల విస్తీర్ణం భూమి ఉందని ఇక్కడ కాల్వ లేకున్నా ఉన్నట్లు చూపుతూ 47 గుంటల భూమి మా పేరు నుంచి తొలగించారని దీని సవరించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా కలెక్టరేట్ డీ విభాగం పర్యవేక్షకులకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది