నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.
గాంధారి మండలం మూదేళ్లి చౌరస్తా నుంచి బడపహాడ్ , వర్ని వరకు ఉన్న రహదారిలోని మూలమలుపులు వాహనదారుల పాలిట మృత్యు కుహరాలుగా మారాయి. హెచ్చరిక బోర్డులు, రక్షణ చర్యలు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటూ ప్రాణాలు బలిగొంటున్నాయి.
ప్రమాదాలకు నిలయాలుగా మారిన మలుపులు
గాంధారి మండలం మూదేళ్లి చౌరస్తా నుంచి బడపహాడ్ వర్ని వరకు వెళ్లే దారిలో కంచరాయి తండా, కోనాపూర్ చెరువు కట్ట, కోనాపూర్ శ్మశాన వాటిక, బడపహాడ్ సమీపంలో ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఇవన్నీ 90 డిగ్రీల వంపుతో, ఒకవైపు లోయ, మరోవైపు చెరువు ఉండేలా ఉన్నాయి. కానీ వాహనదారులను అప్రమత్తం చేసేందుకు ఒక్క సూచిక బోర్డు, 'ప్రమాదకర మలుపు' అని తెలిపే హెచ్చరిక బోర్డు కూడా లేదు.
చెరువుకట్ట మలుపు: ప్రాణాలు తీసిన చరిత్ర.
కోనాపూర్ చెరువు కట్ట వద్ద ఉన్న మూలమలుపు గతంలోనే పలువురి ప్రాణాలు బలిగొంది. స్థానికుల కథనం ప్రకారం ఈ మలుపు వద్ద అదుపుతప్పి చెరువులో పడి మృతిచెందిన సంఘటనలు ఉన్నాయి. అయినా అధికారుల్లో చలనం లేదు. మూడు రోజుల క్రితమే ఒక కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం తప్పినా వాహనం పూర్తిగా ధ్వంసమైంది.
రాత్రివేళ మరింత భయంకరం
ఈ మలుపుల వద్ద రిఫ్లెక్టర్లు, క్యాట్ ఐస్, క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయలేదు. దీంతో కొత్తగా వచ్చే వాహనదారులకు మలుపు ఉన్న విషయం తెలియక వేగంగా వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నారు. "రాత్రి 7 దాటితే ఈ రోడ్డులో వెళ్లాలంటే గుండె దడ. స్మశానం దగ్గర మలుపు, చెరువు పక్కన మలుపు... ఎక్కడ ప్రమాదం జరుగుతుందో తెలియదు"
తరచూ ఆసుపత్రుల పాలవుతున్న వాహనదారులు
సేఫ్టీ చర్యలు లేకపోవడంతో ఈ మలుపుల వద్ద తరచూ ద్విచక్ర వాహనాలు, కార్లు, ట్రాక్టర్లు అదుపుతప్పి బోల్తా పడుతున్నాయి. తీవ్ర గాయాలతో బాన్సువాడ, ఆసుపత్రులకు తరలిస్తున్నారు.అయినా ఆర్అండ్బీ వాళ్లు పట్టించుకోరు" అని కంచరాయి తండా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాహనదారుల డిమాండ్లు
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ ప్రమాదకర మలుపుల వద్ద తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు: