కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం నవాబ్ పేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులు అలసత్వం వద్దని హెచ్చరిక..
ధాన్యం భారీగా వస్తుండడంతో గన్ని బ్యాగ్స్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ప్రతి ఐకేపీ కేంద్రానికి కాంట పూర్తయిన ధాన్యం సంచులు లారీల్లో మిల్లులకు పంపించేలా చర్యలు తీసుకోవాలి..
ఆకస్మిక వర్షం వస్తె ధాన్యం తడవకుండా టార్ఫాలిన్ అందుబాటులో ఉంచుకోవాలి..
ధాన్యం రవాణా తరలింపుకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా ఎంవిఐ అధికారిని నియమించాం..
ఎండల్లో హమాలీ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు..
ఐకేపీ కేంద్రాల్లో పంచాయతీ సెక్రటరీ, ఏఈవో, గ్రామ ధాన్యం కొనుగోలు కమిటీ సమన్వయం చేసుకుంటు కొనుగోలు వేగవంతంగా పూర్తి చేయాలి..