ఎల్లారెడ్డిపేట నేటి ప్రభాతదర్శిని ఏప్రిల్ 22 :
ప్రభుత్వ వైద్యులు గుండెపోటుకు గురై మృతి చెందిన విషాదకర ఘటన బుధవారం నిర్మల్ జిల్లా బైంసాలో చోటు చేసుకుంది.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన జీడి సురేందర్ ( 53 ) బైంసా ఏరియా హాస్పిటల్ సూపరిండెండెంట్గా విధులు నిర్వహిస్తుండగా బుధవారం గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం.. ఆయనకు భార్య జ్యోతి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్న కూతురు ప్రీతి (25 ) 8వ తరగతి చదువుతున్న కూతురు అవంతిక ( 12 ) ఉన్నారు డాక్టర్ సురేందర్ బైంసా ఏరియా హాస్పిటల్ సూపరిండెండెంట్గా విధులు నిర్వహిస్తూ బుధవారం ఓ పేషెంట్ కు థియేటర్ రూమ్ లో చికిత్స అందిస్తుండగా హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే కింద కుప్పకూలిపోయాడు.. వెంటనే వైద్య బృందం నిర్మల్ లోని హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందాడు.. దీంతో ఎల్లారెడ్డిపేట గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.. డాక్టర్ జి డి సురేందర్ మృతి పట్ల గ్రామస్తులు ఆయన గురించి గుర్తు చేసుకుంటూ బోరున విలపిస్తున్నారు, దీంతో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం శోకసముద్రం అయింది
ఆయన మృతదేహాన్ని బైసా నుండి స్వగ్రామమైన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి తీసుక రావడానికి ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తరలి వెళ్లారు, మృతదేహాన్ని గురువారం ఉదయం వరకు తీసుకువచ్చి అంత్యక్రియలు మధ్యాహ్నం వరకు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది,
భైంసా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి సూపరిటేండెంట్ జీడి సురేందర్ మృతి చెందడం బాధాకరమని ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి సత్యనారాయణ స్వామి డాక్టర్ జి అభినయ్ డాక్టర్ వడ్నాల శ్రీనివాస్ గ్రామ సర్పంచ్ ఎలగందుల నరసింహులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోమ్మాటీ నరసయ్య ఎ జి పి పసుల కృష్ణ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు ఖానాపూర్ లక్ష్మణ్ మాదిగ మాలమహానాడు జిల్లా అద్యక్షులు ఎడ్ల రాజ్ కుమార్ సీనీయర్ జర్నలిస్ట్ బండారి బాల్రెడ్డి , నంది కిషన్ మేగి నరసయ్య, లు అన్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు,