• Other News
  • Live TV
  • పోసానిపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన. జిల్లా కలెక్టర్ నేటి ప్రభాత దర్శిని కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్

    Reporter
    admin April 17, 2026, 3:24 pm
    పోసానిపేట గ్రామంలో  వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన. జిల్లా కలెక్టర్   నేటి ప్రభాత దర్శిని  కామారెడ్డి ప్రతినిధి. కరుణాకర్

    రామరెడ్డి మండలంలోని పోషనిపేట్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్య కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పరిశీలించారు.
    ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు విధానాన్ని సమీక్షించి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా కొనుగోలు ప్రక్రియ కొనసాగించాలని అధికారులకు సూచించారు.

    ప్రతి వరి సంచికి 40.600 కిలోల తూకం ఉండేలా ఖచ్చితంగా కొలవాలని ఆయన ఆదేశించారు. తూకం ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,
    అనంతరం సన్న దాన్యం నాణ్యతను మిషన్ ద్వారా పరీక్షించి, తేమ శాతాన్ని పరిశీలించారు. ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు.

    అలాగే కేంద్రంలో మౌలిక సదుపాయాలు, తాగునీరు, నిల్వ సౌకర్యాలు సక్రమంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

    రైతులు తమ ధాన్యాన్ని సులభంగా విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ అధికారి వెంకటేశ్వర్లు, dm శ్రీకాంత్, dco రామ్మోహన్, mro సుమలత, పంచాయతీ సెక్రెటరీ, సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

    📰 e-Paper Clip
    Google News Follow
    Most Viewed
    మహిళలు మీరెక్కడ..?  ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర

    మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర