రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ -06
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రజల నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అర్జీలు స్వీకరించారు. అర్జీలు పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 253 దరఖాస్తులు వచ్చాయి.
రెవెన్యూ శాఖకు 67, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి 64, హౌసింగ్ శాఖకు 46, జిల్లా పంచాయతీ అధికారికి 13, జిల్లా ఉపాధి కల్పనాధికారికి 9, జిల్లా విద్యాధికారికి 6, జిల్లా సంక్షేమ అధికారికి 5, నీటి పారుదల శాఖ, సెస్ సంస్థ, ఎస్డీసీ, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పౌర సరఫరాల అధికారి, జిల్లా వైద్యాధికారి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు మూడు చొప్పున, జిల్లా అటవీశాఖ అధికారి, సబ్ రిజిస్టార్ సిరిసిల్ల, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సిరిసిల్లకు రెండు చొప్పున, చేనేత చేనేత శాఖ, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జిల్లా మైనింగ్ అధికారి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిజిల్లా పౌర సంబంధాల అధికారి, ఈ డీ ఎం, ఆర్ అండ్ బీ అధికారి, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ కార్యాలయానికి ఒకటి చొప్పున దరఖాస్తులు రాగా, సంబంధిత శాఖల అధికారులకు అందించి, పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి లో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధా భాయ్, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు