జగిత్యాల జిల్లా కు చెందిన 60 ఏళ్ల మహిళ రొమ్ములో గడ్డతో వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి కి రావడం జరిగింది.షుగర్ వ్యాధితో చాలా ఏళ్లుగా బాధ పడుతున్న ఆమెకు నోటిని పూర్తిగా తెరవడం లో కూడా ఇబ్బంది ఉంది. జనరల్ అనస్థీషియా ఇచ్చేందుకు అనువుగా లేకపోవడం వల్ల హైదరాబాద్ లాంటి పెద్ద ఆసుపత్రి కి పంపించాలి.కానీ మత్తు వైద్యులు తిరుపతి,రాజశ్రీ ల సలహాతో అరుదయిన మత్తు ఇచ్చి ఇక్కడే ఆపరేషన్ చెయ్యాలని సీనియర్ ఆపరేషన్ల నిపుణులు డా. పెంచలయ్య నిర్ణయించుకొని వారి బృందం డాక్టర్లు మోహన్ కృష్ణ, అలేఖ్య లతో మత్తు వైద్యులు డా. తిరుపతి , రాజశ్రీ సెగ్మెంటల్ థొరాసిక్ ఎపిడ్యూరల్ అనస్థీషియా ద్వారా ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తిచేశారు.ఇట్టి ఆపరేషన్ చేసిన బృందానికి సూపరిండెంట్ డా.రవీందర్ అభినందనలు తెలియజేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో గతంలో లాగా సాధారణ కాన్పులు మరియు ఆపరేషన్లు జరుగుతున్నాయని ప్రజలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఆపరేషన్ లో పాల్గొన్నఇతర సిబ్బంది కి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
TELANGANA JAGTIAL
వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదయిన మత్తు ద్వారా ఆపరేషన్..
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.