స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జిల్లా లో పారదర్శకం గా నిర్వహించాలని
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు.
మాస్టర్ ట్రైనర్లు ( తహసీల్దార్ లు రఘునాథ్ పల్లి, చిల్పూర్ ) ద్వారా...
తహసీల్దార్ లకు, నియోజకవర్గ స్థాయి ట్రైనర్లకి SIR మీద బుధవారం కలెక్టరెట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....
ఓటరు జాబితా స్వచ్చత,పారదర్శకత కోసం ఇంటెన్సివ్ రివిజన్ అత్యంత ముఖ్యమని తెలిపారు
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా... భారత ఎన్నికల సంఘం నియమ నిబంధన లకు అనుగుణంగా..బూత్ లెవెల్ ఆఫీసర్లు..ఇంటింటి వెరిఫికేషన్ ద్వారా..
కొత్త ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, చనిపోయిన వారి పేర్లను తొలగించడం, తదితర పనులు ఖచ్చితత్వం తో క్షేత్ర స్థాయి లో చేయాలిసి ఉంటుందన్నారు
క్షేత్ర స్థాయి లో SIR లో భాగం గా.. ఎన్యుమరేటర్ అప్లికేషన్ పైన.. BLO లు పూర్తి అవగాహన కలిగి ఉండి... ఓటర్లకి అందులో ఉన్న వివరాలను తెలియజేయాలన్నారు
ఈ కార్యక్రమం లో ఆర్డివో లు గోపి రాం, వెంకన్న, తహసీల్దార్ లు, ఎలక్షన్ డి టి పాల్గొన్నారు