నిర్మల్ జిల్లా కడెం మండలంలోని అంబారిపేట్ గ్రామం లో బుధవారం ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్. మాట్లాడుతూ మహాత్మా గాంధీని చంపిన గాడ్సే వారసులు పేదలకు పని కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో విబిజి రాంజీ. (వికాసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్) చట్టాన్ని తీసుకువచ్చి 125 రోజులు పని కల్పిస్తామంటే ప్రజలు నమ్మవద్దని పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అంబారీ పేట్ గ్రామం వద్ద రోడ్డుపై హరితహారం మొక్కల వద్ద ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న వ్యవసాయ కూలీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి. మాట్లాడుతూ 12 సంవత్సరాల బిజెపి పరిపాలన కాలంలో ఉపాధి హామీ సిబ్బందికి సరైన సమయంలో వేతనాలు చెల్లించకుండా నెలల తరబడి పెండింగ్ పెట్టినటువంటి పాలకులు ఉపాధి కూలీలకు రెండు మూడు నెలల తర్వాత వేతనాలు చెల్లిస్తున్న ఈ పాలకులు 125 రోజులు పని కల్పిస్తామని విబిజి రాంజీ అనే చట్టం తేవడాన్ని ప్రజలందరూ వ్యతిరేకించి విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని గ్రామాలలో గ్రామ పంచాయతీల ముందు ధర్నాలు చేయాలని వ్యవసాయ కూలీలకు పిలుపునిచ్చారు ఉపాధి హామీ పనులను బందు చేయడంలోభాగంగానే విబిజి రాంజీ అనే కొత్త చట్టాన్ని తీసుకువచ్చారన్నారు వ్యవసాయ కూలీలకు నష్టం చేసే విబిజి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA NIRMAL
మార్చి 18 కడెం నేటి ప్రభాత దర్శినిఉపాధి హామీ వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.