పెద్దపల్లి, ఫిబ్రవరి-20:
రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ విద్యార్థుల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులను శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో
తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ఫిబ్రవరి 17న హైదరాబాద్ లోని దోమలగూడ లో ప్రభుత్వ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ (CWSN) విద్యార్థుల కోసం నిర్వహించిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలలో పెద్దపెల్లి జిల్లాకు చెందిన 20 మంది సి.డబ్ల్యూ.ఎస్.ఎన్ విద్యార్థులు వివిధ క్రీడా విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని అన్నారు.
జూలపల్లి మండలానికి చెందిన బడుగు సందీప్ జిగ్ జాగ్ వాకింగ్ లో 1వ బహుమతి , కమాన్ పూర్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన
ఎడునూరి పౌర్ణమి చెస్ పోటీలో 1వ బహుమతి, రొంపికుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన కటకం శ్రీరామ్ చరణ్ పరుగుపందెంలో 1వ బహుమతి, మ్యూజికల్ చైర్ లో 2వ బహుమతి, జిగ్జాగ్ వాకింగ్ లో 2వ బహుమతి సాధించారు.
విజేతలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష , జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి శారద ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీమతి జి.శారద, ఐఈ కోఆర్డినేటర్ జి. కవిత సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.