పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి దివ్యాంగ క్రీడా పోటీల్లో
కరీంనగర్ జిల్లాలోని భవిత కేంద్రాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు ప్రతిభ చాటారు. జిల్లాలోని చిగురుమామిడి, తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగవిద్యార్థులు అండర్ 14, అండర్ 17 రన్నింగ్ పోటీల్లో విజయం సాధించారు. చిగురుమామిడి భవిత కేంద్రానికి చెందిన రెంటాల సాత్విక్ రెడ్డి అండర్ 14 మానసిక దివ్యాంగుల రన్నింగ్ విభాగంలో మూడో బహుమతి సాధించాడు. తిమ్మాపూర్ మండలం మోహమ్మద్ అమన్ ఖాన్ అండర్ 14 బధిరుల విభాగంలో రెండవ బహుమతి కైవసం చేసుకున్నాడు. కరీంనగర్ రూరల్ మండలం ఏలూరి పవన్ సాయి అండర్ 14 మానసిక దివ్యాంగుల విభాగం 50 మీటర్ల పరుగు పందెంలో మూడవ బహుమతి సాధించారు. కలెక్టర్, డీఈవో అభినందన రాష్ట్ర స్థాయి దివ్యాంగ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, జిల్లా విద్యా అధికారి అభినందించారు. విద్యార్థులను పోటీలకు సిద్ధం చేసిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ప్రతి విద్యార్థికి సమాన అవకాశాలు, ప్రోత్సాహం, సమగ్ర వేదికలు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లిన వారిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు, ఐ.ఈ.ఆర్.పి.ఎస్ రాపర్తి గణేష్, శ్రీలత, తిరుపతి, తల్లిదండ్రులు ఉన్నారు.
TELANGANA KARIMNAGAR
రాష్ట్రస్థాయి క్రీడల్లో కరీంనగర్ జిల్లా "భవిత" విద్యార్థుల ప్రతిభ
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం