Deprecated: ltrim(): Passing null to parameter #1 ($string) of type string is deprecated in /home/u229881858/domains/netiprabhatadarshini.in/public_html/single.php on line 57
NETI PRABHATA DARSHINI
  • Other News
  • Live TV
  • ప్రేరణ తో... ప్రోత్సాహం ప్రతీ విద్యార్థి కి విజయోస్తు లేఖ అందించిన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్

    Reporter
    admin February 10, 2026, 4:17 pm

    ఫిబ్రవరి 10
    జనగామ.
    పట్టుదల తో చదవండి
    రివైజ్, ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్ ముఖ్యం
    స్మార్ట్ గా ఆలోచించండి
    స్కోర్ పెంచుకోండి తల్లిదండ్రులు గర్వ పడేలా భవిష్యత్ ని తీర్చి దిద్దుకోండి
    జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పదవ తరగతి పరీక్షలకు ప్రతీ విద్యార్థి పక్కా యాక్షన్ ప్లాన్ తో ప్రిపేర్ అయ్యి... మంచి మార్కులు సాధించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు Sc, బీసీ, మైనారిటీ ప్రభుత్వ వసతి గృహల్లో గల 10 వ తరగతి విద్యార్టీని, విద్యార్థులకు 2025=26 వార్షిక పరీక్షల పైన ప్రేరణ - అవగాహన తరగతుల ను స్థానిక గీతాంజలి పాఠశాల లో ఏర్పాటు చేసారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిధి గా హాజరై ముందుగా.. విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యలను పరీక్షించారుఈ అవగాహన తరగతులు ఎంత మేరకు విద్యార్థులకు ఉపయోగ పడుతున్నాయి, ఏమేమి నేర్చుకున్నారు అనే విషయాల పైన విద్యార్థులను కలెక్టర్ స్వయం గా అడిగి తెలుసుకున్నారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ....తమ పిల్లలు ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న తల్లిదండ్రుల కోరిక ని విద్యార్థులు నిజం చేసే దిశగా కష్ట పడి చదవాలన్నారు పదవ తరగతి... విద్యార్థుల కేరిర్ కి పునాది వంటిదని.. ఇందులో మంచి మార్కులను సాధిస్తే వారి లక్ష్యాలకు తగ్గట్టు గా పై చదువు లకు వెళ్లొచ్చన్నారు. ఏ రోజు కి ఆ రోజూ... విద్యార్థులు తమ సామర్ధ్యలను పెంపొందించుకోవాలన్నారు విజయోస్తు 2.0 మెటీరియల్ ని క్షుణ్ణం గా చదవాలని....
    అన్ని సబ్జెక్ట్ ల్లో ఎక్కువ మార్కు లు వచ్చే విధంగా ఎలా చదవాలో తెలుసుకోవాలని....... ప్రీవియస్ పేపర్స్ కి కూడా ఒకటికి రెండు సార్లు ప్రిపేర్ అవ్వాలన్నారుఆరోగ్య సమస్య లు ఉన్నాయని.... పరీక్షలకు రాకుండా ఉండవద్దని.. ప్రతీ పరీక్ష కేంద్రం లో మెడికల్ సిబ్బంది ఉంటారని... వారు మిమ్మల్ని జాగ్రత్త గా చూసుకుంటారని... ఏ సబ్జెక్ట్ ని గైర్హాజరు కాకుండా విద్యార్థులు అన్ని సబ్జెక్ట్ లను అటెండ్ చేయాలన్నారుప్రతీ మండలం లో ఎక్కువ మార్కులు తెచ్చుకున్న టాపర్ లకు సైకిల్ బహుకరిస్తామన్నారు. పదవ తరగతి లో తాను ఎలా ప్రిపేర్ అయ్యారో, ఏ ఎ సబ్జెక్ట్ లకు ఏవిధం గా చదివి ముందుకు వెళ్ళారో కలెక్టర్ ఈ సందర్బంగా విద్యార్థులతో పంచుకున్నారు. చదివే టైమ్ లో చదవాలని, భోజనం చేసే టైం లో భోజనం చేయాలనీ, సమయానికి నిద్ర పోవాలని... ఇలా ప్రతీ దానికి ఒక పద్ధతి పెట్టుకుంటే... జీవితం లో అదే క్రమశిక్షణ తో మంచి స్థానాల్లో సెటిల్ అవ్వచ్చన్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న ఈ నేపథ్యంలో... ప్రతీ రోజూ ను సద్వినియోగం చేసుకొని...... కష్టం గా భావించే సబ్జెక్ట్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రివైజ్, ప్రాక్టీస్, టైం మేనేజ్మెంట్, చేతి రాత మొదలగు అంశాలు ముఖ్యమని...విద్యార్థులు గమనించాలని...పదవ తరగతి లో వంద శాతాం ఉత్తిర్ణ త సాధించి... జిల్లా కి మంచి పేరు తేవాలన్నారు. పరీక్షలను ఆనందం గా... ఆత్మ విశ్వాసం తో రాయాలని వారికి స్ఫూర్తి ని ఇస్తూ... తాను స్వయం గా రాసిన విజయోస్తు లేఖ ని కలెక్టర్ విద్యార్థులకు అందించి వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ప్రేరణ కార్యక్రమం లో...మాథ్స్, ఫిజికల్ సైన్స్, హిందీ గైడన్స్ అండ్ కౌన్సిలింగ్ తదితర సబ్జెక్ట్ ల మీద విద్యార్థులకు టీచర్ లు అవగాహన కల్పించారు

    📰 e-Paper Clip
    Google News Follow