రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి - 9
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆయా కేంద్రాల్లో ముందు రోజు (ఈ నెల 10 వ తేదీన మంగళ వారం) అలాగే పోలింగ్ రోజున (ఈ నెల 11 వ తేదీన బుధవారం) సెలవులు ప్రకటించినట్లు ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ తెలిపారు. ఈ నెల 11వ తేదీన బుధవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలింగ్ నిర్వహించే కేంద్రాల్లో ముందు రోజు అలాగే పోలింగ్ రోజు జిల్లాలోని విద్యా సంస్థలు, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన కార్యాలయాలకు స్థానిక సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, కార్పొరేషన్లు, సంస్థల ఉద్యోగులు, సిబ్బంది ఓటు హక్కు వినియోగించు కునేందుకు పోలింగ్ రోజున ఈ నెల 11వ తేదీన సెలవు వర్తిస్తుందని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
పోలింగ్ రోజున పబ్లిక్ హాలిడే ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం