రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి - 07
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి
ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఫెసిలిటేషన్ కేంద్రం పరిశీలన
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విధులకు హాజరయ్యే వారు పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోవాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ శనివారం పరిశీలించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ కోసం సిద్ధం చేసిన ఫారాలను పరిశీలించారు. అక్కడ ఉన్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని, 8వ తేదీ ఆదివారం కూడా ఓటు హక్కు వినియోగించుకో వచ్చని స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కునేవారు సంబంధిత ఫారాలు అన్ని జత చేసి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు.
TELANGANA RAJANNA SIRCILLA
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలి ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **