ఫిబ్రవరి 7
జనగాం
స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా కౌంటింగ్ హాల్స్ ఏర్పాట్లు, టేబుల్స్ అమరిక, కౌంటింగ్ సిబ్బంది ఏర్పాట్లు, భద్రతా చర్యలు, సీసీటీవీ పర్యవేక్షణ, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, త్రాగునీరు–శౌచాలయ సదుపాయాలు, విద్యుత్ సరఫరా ఇతర మౌలిక వసతులపై అదనపు కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా, చట్టబద్ధంగా ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.....కౌంటింగ్ ప్రక్రియ ఎన్నికలలో అత్యంత కీలక దశ అని భద్రతా ప్రమాణాలు పాటిస్తూ, పూర్తి పారదర్శకతతో సమయపాలనతో కౌంటింగ్ నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ పరిశీలన కార్యక్రమంలో RDO ఘనపూర్ స్టేషన్, మున్సిపల్ కమిషనర్, ఘనపూర్ స్టేషన్, తహసీల్దార్, మాస్టర్ ట్రైనర్లు మ సంబంధిత లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
TELANGANA JANGOAN
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ శనివారం పరిశీలిన
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం