రాజన్న సిరిసిల్ల, జనవరి - 30
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రగుడు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు.ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 20 లక్షల డబ్బులు సీజ్ చేశామని, తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు.తనిఖీలో నోడల్ అధికారులు నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సాధారణ, వ్యయ పరిశీలకులు
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం