రామగుండం, జనవరి- 29:
పురపాలక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జిల్లాలో సజావుగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.
గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రామగుండం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముబారక్ నగర్, సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న 60 డివిజన్ లకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం రామగుండంలో 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని, పురపాలక ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జనవరి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, జనవరి 31న నామినేషన్ల పరిశీలన పూర్తి చేసి సరిగ్గా నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. నామినేషన్ తిరస్కరించిన అభ్యర్థులు ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటల వరకు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని, సదరు అప్పీల్స్ ను ఫిబ్రవరి 2న పరిష్కరిస్తామని, ఫిబ్రవరి 3 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, ఫిబ్రవరి 3 సాయంత్రం పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు.
TELANGANA PEDDAPALLI
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం