బడికి వచ్చేలా.. పాఠ్యాంశాలపై అవగాహన కలిగేలా..
నూతన హంగులతో ప్రీ ప్రైమరీ విద్యాలయాలు సిద్ధం
ఆకట్టుకుంటున్న చిత్రాలు, పెయింటింగ్
స్తంభంపల్లిలో సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
బోయినపల్లి, జనవరి - 22
బుడి బుడి అడుగుల బాలలు బడికి ఆనందంగా వచ్చేలా.. వారికి పాఠ్యాంశాలపై అవగాహన కలిగేలా తీర్చిదిద్దారు బడిని.
పీఎంశ్రీలో భాగంగా సమగ్ర శిక్ష కింద జిల్లాలోని పలు విద్యాలయాల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లు మంజూరు అయ్యాయి. ఇందులో భాగంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశాల మేరకు బోయినపల్లి మండలంలోని స్తంభంపల్లిలో ప్రీ ప్రైమరీ విద్యాలయానికి నూతన హంగులతో సిద్ధం చేశారు.
ప్రాథమిక విద్య అంశాలపై అవగాహన వచ్చేలా వివిధ రంగులతో చిత్రాలు, పెయింటింగులు, ఫర్నిచర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆ విద్యాలయాన్ని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం సందర్శించారు. పిల్లల ఫ్రెండ్లీ చిత్రాలు, పెయింటింగ్ లు, ఫర్నిచర్ ఏర్పాటు చేయగా ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. ఎందరు విద్యార్థులు చదువుతున్నారు? ఏమి ఏమి నేర్పిస్తున్నారో ఆరా తీశారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని ఆదేశించారు. జిల్లాలోని పదమూడు మండలాల్లో ప్రీ ప్రైమరీ తరగతులు కొనసాగు తున్నాయి. అనంతరం అదే ఆవరణలోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. సైన్స్ కు సంబంధించిన పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. వార్షిక పరీక్షలకు ప్రణాళిక ప్రకారం సిద్ధం కావాలని సూచించారు. ఈ స్కూళ్లో విద్యార్థుల అడ్మిషన్లు పెంచేలా కృషి చేయాలని టీచర్లను ఆదేశించారు.కార్యక్రమంలో డీఈఓ వినోద్ కుమార్, తహసిల్దార్ నారాయణరెడ్డి, ఎంపీఓ శ్రీధర్, డీఈఓ కార్యాలయ అధికారి శైలజ, సర్పంచ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
నూతన హంగులతో ప్రీ ప్రైమరీ విద్యాలయాలు సిద్ధం స్తంభంపల్లిలో సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.