మహిళా దినోత్సవంలోగా అందుబాటులోకి తీసుకురావాలి
ఐఎంఎస్ భవన నిర్మాణ పనుల పరిశీలనఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో రూ. ఐదు కోట్ల నిధులతో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఇందిరా మహిళా శక్తి (ఐఎంఎస్) భవన నిర్మాణ పనులను బుధవారం ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ముందుగా భవన నిర్మాణ ప్లాన్ లను పరిశీలించారు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ పూర్తి కాగా, గోడల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అన్ని గదులు పరిశీలించి.. ఎప్పటిలోగా పూర్తి అవుతాయో ఆరా తీశారు. పనుల పురోగతిని నిత్యం పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. భవన పనుల కోసం కార్మికుల సంఖ్యను పెంచి మార్చి 08వ తేదీలోగా పూర్తి చేయాలని ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డిని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.పరిశీలనలో జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు భాగ్య, డీఆర్డీఓ గీత, ఈఈ పీఆర్ సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఈ సతీష్ తదితరులు ఉన్నారు.
TELANGANA RAJANNA SIRCILLA
ఇందిరా మహిళా శక్తి భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **
మహిళలు మీరెక్కడ..? ప్రతి ఏడాది మార్చి 8 అనంగానే మహిళల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుని ఆయా రంగాల్లో ముందంజలో ఉన్న మహిళల గురించి మాట్లాడటం వంటివి చేస్తాం. మహిళలు అందిపుచ్చుకోవాల్సిన వాటి గురించి చర్చిడం వంటివి కూడా చేస్తాం. పైగా భారత్ లింగ సమానత్వ సూచీలో మెర
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కోనాపూర్ లో గురుకుల పాఠశాల నిర్మాణ పనులలో జాప్యం. నేటి ప్రభాతదర్శిని బాన్సువాడ ప్రతినిధి.