హీటర్ అందించిన కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన విద్యార్దినులు
*రంగంపల్లి లోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్
రానున్న 10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో విద్యార్థినుల కోసం ప్రత్యేకంగా అందించిన 5 వేల లీటర్ల సామర్థ్యం గల హీట్ పంప్ సరిగ్గా పని చేస్తుందా, పిల్లలకు ఉపయోగపడుతుందా అనే వివరాలను కలెక్టర్ తెలుసుకున్నారు. అర్ధ వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎల్లా చదువుతున్నారు, పిల్లలకు స్టడీ అవర్స్ సరిగా జరుగుతున్నాయా వంటి వివరాలను ఆరా తీశారు. 10వ తరగతి , ఇంటర్ విద్యార్థినులు బాగా చదువుకోవాలని, ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సూచించారు. పిల్లలకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మంచి నాణ్యమైన ఆహారం అందించాలని, గురుకులం లోని వంటశాల ను పరిశీలించిన కలెక్టర్ కూరగాయలు పండ్లు, పాలు , సన్న బియ్యం ఇతర పదార్థాలు సరిగ్గా సరఫరా అవుతున్నాయా వివరాలు తెలుసుకున్నారు. పిల్లలకు తాజా కూరగాయలు మాత్రమే ఆహారంలో వినియోగించాలని, స్టోర్ చేసిన ఆహారం పిల్లలకు అందించ వద్దని ఎప్పటికప్పుడు వేడివేడిగా అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలకు 5000 లీటర్ల హీటర్ అందించినందుకు విద్యార్థులు కలెక్టర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA PEDDAPALLI
పరీక్షలలో విద్యార్థినులు మంచి ఫలితాలు సాధించాలి..... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
మహిళా, శిశు సంక్షేమానికి శుక్రవారం సభ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
మూగ జీవాలకు ఆహారా న్నందించి మానవత్వం చాటుకున్న మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు
ఉచిత గర్భగోష నివారణ చికిత్స శిబిరం
1734 రోజులుగా పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమాలు
విద్యార్థి దశ నుంచే క్రీడలకు ప్రోత్సాహం వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సీఎం కప్ పోటీలు ప్రారంభం