మన సంప్రదాయానికి ప్రతీక అయిన చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దామని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి సంక్షేమ పథకాలు అందించి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని పేర్కొన్నారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ..
ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలు ధరించేలా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పచ్చనూరు చేనేత క్లస్టర్ తయారు చేసిన చీరను ఆవిష్కరించారు. ఆడిటోరియం వద్ద టెస్కో కరీంనగర్ డివిజన్ ఆధ్వర్యంలో చేనేత వస్త్రాలతో కూడిన ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేశారు.
అనంతరం చేనేత ప్రతిజ్ఞ చేశారు.
అంతకుముందు గీతా భావం చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు చేనేత సహకార సంఘాల అధ్యక్షులు పాలకవర్గ సభ్యులు, కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ఏడీ రాఘవరావు, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం, మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేటర్ వాసాల రమేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
TELANGANA KARIMNAGAR
చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ప్రోత్సహిద్దాం కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మేయర్ కోలగాని శ్రీనివాస్, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **