శనివారం, హైకోర్టు, అడ్మినిస్ట్రేషన్, జనగామ జిల్లా పోర్ట్ ఫోలియో జడ్జీ సురేపల్లి నందా జిల్లాకు విచ్చేశారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు నిర్వహించిన గౌరవ వందనాన్ని హైకోర్టు జడ్జీ స్వీకరించారు.
ఈ నేపథ్యంలో... పోలీసు కమిషనర్ (సీపీ) శ్వేత, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా,జనగామ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ మర్యాదపూర్వకంగా హైకోర్టు జడ్జీని కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి, ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో న్యాయ శాఖ, పోలీసు శాఖ అధికారులు పాల్గొన్నారు