ఘటాలు, బోనాల ఊరేగింపు మార్గాన్ని పరిశీలించిన చార్మినార్ జోన్ ,డిసిపి ,కిరణ్ కారే ప్రభాకర్.
నేటి ప్రభాత దర్శిని ! చంద్రాయణ గుట్ట ! కాశీ విశ్వనాధ్ ఆలయం లో చార్మినార్ జోన్ డిసిపి, కిరణ్ కారే ప్రభాకర్. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కాశీ విశ్వనాథ దేవాలయం నుండి ఈ ఆదివారం నిర్వహించనున్న ఘటాల ఊరేగింపు మరియు బోనాల మహోత్సవాల సందర్భంగా చార్మినార్ జోన్ డిసిపి, కిరణ్ కారే ప్రభాకర్. ఊరేగింపు మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. అనంతరం ఆలయాల వద్ద క్యూ లైన్ ల నిర్వహణ, భక్తుల రాకపోకలు, విఐపి దర్శన ఏర్పాట్లు, భారీ కేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది, అలాగే భద్రత ఏర్పాట్ల పై పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోన్ డిసిపి, కిరణ్ కారే ప్రభాకర్. మాట్లాడుతూ బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా సజావుగా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీలో ఛత్రినాక ఏసిపి, సి.హెచ్, చంద్రశేఖర్. ఛత్రినాక ఇన్ స్పెక్టర్ ,ఎస్ ,కోటేశ్వరరావు. మొగల్ పుర ఇన్ స్పెక్టర్ ,సి,శ్రీను. తో పాటు ఛత్రినాక, మొగల్ పుర, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.