*స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం sir ప్రక్రియ లో ముందు ఉండాలి. కడియం శ్రీహరి **
*ఓటరు జాబితా సవరణలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం మొదటి స్థానంలో నిలవాలి....*
*ప్రస్తుతం రాష్ట్రంలో 4వ స్థానంలో ఉన్నాం.... 25వ తేదీ నాటికి 100శాతం పూర్తి చేసి మొదటి స్థానంలో నిలవాలి.....*
*అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని BLA లు, క్లస్టర్ ఇంచార్జ్ లు పని చేయాలి.....*
*25తేదీన మళ్ళీ సమావేశం ఉంటుంది... ఈ సమావేశానికి 100శాతం రిపోర్ట్ తో హాజరు కావాలి.....*
*అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా చూసుకోవాలి.....*
*BLO లతో సమన్వయం చేసుకొని ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి.....*
*బీజేపీ ప్రభుత్వం SIR పేరుతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగించే ఉదేశ్యంతో ఉంది....*
*మనందరం కలిసి బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి.....*
*ఒక్కరూ కూడా ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తగా ఎన్యూమరేషన్ పూర్తి చేయాలి.....*
*ఓటరు జాబితా సవరణ (S.I.R) కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆ దిశగా ప్రతీ ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పని చేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గారు, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు పిలుపునిచ్చారు.*
నేటి ప్రభాత దర్శిని వరంగల్. ప్రతినిధి
స్టేషన్ఘన్పూర్ పట్టణ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ (S.I.R) పై నియోజకవర్గ SIR క్లస్టర్ ఇంచార్జ్ లు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, ఏఐసిసి పరిశీలకులు అహ్మద్ నాసిర్ గారు, టీపిసిసి నియోజకవర్గ పరిశీలకులు దుద్దిల్ల శ్రీను బాబు గారు, మాస్టర్ ట్రైనర్ రాజశేఖర్ రెడ్డి హన్మకొండ, జనగామ డిసిసి అధ్యక్షులు ఇనుగాల వెంకట్రాంరెడ్డి. లకావత్ ధన్వంతి పాల్గొన్నారు.
*ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ....,*
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అర్హులైన ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను నిర్లక్ష్యంగా తీసుకుంటే భవిష్యత్తులో ప్రజలకు సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరికి ఓటు హక్కు ఉండేలా చర్యలు తీసుకోవాలని, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు, నకిలీ ఓట్ల తొలగింపుతో పాటు చట్టబద్ధమైన ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగిపోకుండా చూడాలని సూచించారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో సుమారు 80 శాతం ప్రక్రియ పూర్తయిందని, మ్యాపింగ్ పనులు 94 శాతం వరకు జరిగినట్లు తెలిపారు. మిగిలిన రోజులలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించాలని, జాబితాలో లేని వారిని ఫోన్ ద్వారా సంప్రదించి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. BLOలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, ఎక్కడైనా సమస్యలు ఎదురైతే ఇన్చార్జీలు, వార్రూమ్ ప్రతినిధులు, పరిశీలకుల సహకారం తీసుకోవాలని పేర్కొన్నారు. అర్బన్ ప్రాంతాల్లో ఉద్యోగాలు, బదిలీలు, పిల్లల చదువుల కారణంగా ప్రజలు నివాసాలు మారడం వల్ల ఓటర్లను గుర్తించడం కష్టంగా మారుతోందని, అలాంటి ప్రాంతాల్లో మరింత శ్రద్ధ అవసరమన్నారు. రాబోయే స్థానిక సంస్థలు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలపై కూడా ఈ సవరణ ప్రభావం ఉంటుందని తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్ఐఆర్ పేరుతో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తోందని ఆరోపించిన ఎంపీ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో కనీసం 95 శాతం వరకు ఓటర్ల ధృవీకరణ పూర్తయ్యేలా కృషి చేయాలని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.
*ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు మాట్లాడుతూ....*
ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవాలని అన్నారు. ప్రస్తుతం స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రాష్ట్రంలో 4వ స్థానంలోఉన్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జూమ్ మీటింగ్ లో తెలపడం సంతోషంగా ఉందని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో నిబద్దతతో పని చేస్తున్న క్లస్టర్ ఇంచార్జ్ లు, బిఎల్ఏ లకు అభినందనలు తెలిపారు. 25వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు మరోసారి నియోజకవర్గ స్థాయి ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై పూర్తి స్థాయి సమావేశం ఉంటుందని అన్నారు. 25వ తేదీ కి ఇంకా 6రోజుల సమయం ఉందని ఈ 6రోజులలో ప్రతీ బూత్ లో 95శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని సూచించారు. బిఎల్ఏ లు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రతీ ఒక్కరూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని తెలిపారు. 25వ తేదీన క్లస్టర్ ఇంచార్జ్ లు, బిఎల్ఏలు, సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులతో నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని, ఈ సమావేశానికి క్లస్టర్ ఇంచార్జ్ ల పరిధిలోని బిఎల్ఏలు, సర్పంచులు గ్రామ అధ్యక్షులు సమావేశానికి హాజరయ్యే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత క్లస్టర్ ఇంచార్జ్ లదే అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా 100శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేసిన క్లస్టర్ ఇంచార్జ్ లకు కండువా కప్పి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూలుకుంట్ల లావణ్య శిరీష్ రెడ్డి, ఓటరు జాబితా సవరణ నియోజకవర్గ ఇంచార్జ్ లింగాల జగదీష్ చందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్ లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.