నేటి ప్రభాత దర్శిని 27-07-2026 హైదరాబాద్ పాతబస్తీ లోని చంద్రాయణ గుట్ట నియోజకవర్గం, యాకుత్ పుర నియోజకవర్గాలలోని చంద్రాయణ గుట్ట, ఫలక్ నుమ, అలియాబాద్, గౌలిపుర, ఉప్పుగూడ, లలితా బాగ్ డివిజన్ లలో ప్రధాన రోడ్లు మొదలుకొని గల్లీలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఖచ్చమోరి నాలలు మరమ్మత్తులకై అలాగే విద్యుత్ కేబుల్ వైర్లు మరమ్మత్తులకై రోడ్లను త్రవ్వి మరమ్మత్తులు చేయకుండా అలాగే వదిలేయడంతో చిన్న పాటీ వర్షానికి అడుగడుగునా రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వాహనదారు లు, పాదాచారులు, భయంతో ప్రయాణం ముందుకు సాగవలసి వస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నాణ్యత పనులు చేయకపోవడంతో మూన్నాళ్ళకే ఎక్కడికక్కడ కంకర తేలి గుంతలుగా ఏర్పడుతున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. రానున్న బోనాల ఉత్సవాలు, వర్షాకాలం అయినప్పటికీ జిహెచ్ఎంసి అధికారులు రోడ్డు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని పాతబస్తీలోని ప్రజల విమర్శలు వెళ్ళు వెతుకుతున్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు రోడ్లు మరమ్మత్తులు చేయడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి తక్షణమే ఎప్పటికప్పుడు రోడ్లు బాగు చేయాలని వాహనదారులు, పాదాచారులు ,స్థానికులు కోరుతున్నారు.
TELANGANA HYDERABAD
గుంతల మయంగా మారిన రోడ్డుతో ప్రజల ఇబ్బందులు.
Subscribe with Mail
Get the latest news and updates delivered straight to your inbox.
పెళ్లి సంబంధాల పేరుతో కొత్త తరహా మోసం.. - బ్యూరోలకే కన్నమేస్తున్న కేటుగాడు!
ఫరీద్పేట్లో బాడీ మీటింగ్ బహిష్కరణ సర్పంచ్ నర్సింహారెడ్డిపై వార్డు సభ్యుల తిరుగుబాటు
మహిళ సంఘ భవన నిర్మాణ భూమి పూజ నేటి ప్రభాత దర్శిని ఇల్లంతకుంట
ప్రైవేట్ పాఠశాలలకు దిటుగా జవాబు ఇచ్చిన మద్దికుంట జిల్లా పరిషత్ హై స్కూల్ పదవ తరగతి ఫలితాలు. నేటి ప్రభాత దర్శిని ప్రతినిధి కరుణాకర్. కామారెడ్డి
మద్దికుంట ప్రీ ప్రైమరి పాఠశాల లో యూనిఫామ్ లు పంపిణీ **