మెదక్ 19.07.2026 ఆదివారం
*SIR కార్యక్రమం మెదక్ నియోజకవర్గంలో 85% డిజిటలైజేషన్ పూర్తి*
మెదక్ నియోజకవర్గ *ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్* గారి నాయకత్వంలో *SIR కార్యక్రమం* చాలా బ్రహ్మాండంగా కొనసాగుతోంది. ఇప్పటికే *85% వరకు డిజిటలైజేషన్ పనులు* విజయవంతంగా పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు మాట్లాడుతూ, మిగిలిన 15% పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
SIR కార్యక్రమం విజయవంతానికి *మండల్ ప్రెసిడెంట్లు, స్థానిక నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు మరియు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు* ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. వారి కృషి వల్లనే ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున విజయవంతమవుతోందని ఎమ్మెల్యే గారు అభినందించారు.
ప్రజాసేవయే లక్ష్యంగా SIR కార్యక్రమాన్ని 100% పూర్తి చేసి, మెదక్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.
*ఇట్లు,*
*మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్*