గంగమ్మ మైసమ్మ తల్లులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మొక్కులు వర్షాలు బాగా కురవాలని వేడుకున్న నాయకులు
📅 11 August 2026, 02:32 PM
✍️ admin
ఎల్లారెడ్డిపేట ఆగస్టు 11 : వీర్నపల్లి మండలం రంగంపేట ఎర్రగడ్డ తాండ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గ్రామ శాఖ ల ఆధ్వర్యంలో లో జంపన్న చెరువు అలుగు దూకుతున్న శుభ సందర్బంగా గంగమ్మ తల్లీ కి మైసమ్మ తల్లికి పూలు కొబ్బరికాయలతో
కాంగ్రెస్ పార్టీ నాయకులు
మొక్కులు చెల్లించుకున్నారు,
వర్షాలు బాగా కురవాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమం లో మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ లాకావత్ రాములు నాయక్. ఎర్రగడ్డ తండా ఉపసర్పంచ్ భూక్యా రమేష్. ఏఎంసి డైరెక్టర్ నందగిరి శ్రీనివాస్. వీర్నపల్లి మండల ఉపాధ్యక్షులు భుజంగాల రాజేష్.. బొజ్జ బాలకిషన్. లాకావత్ తిరుపతి. లాకావత్ రాజేందర్.భూక్యా రాజు.తదితరులు. పాల్గొన్నారు