Banner
Watermark
బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి* *‘రహవీర్’ – పీఎం రహత్ పథకాలపై జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అదేశించారు* *కామారెడ్డి, జులై 30:* రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను
📅 31 July 2026, 01:11 PM ✍️ admin
News Image


*ప్రమాద బాధితులను కాపాడితే రూ.25 వేల బహుమతి*
*‘రహవీర్’ – పీఎం రహత్ పథకాలపై జిల్లా కలెక్టర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలని అదేశించారు*

*కామారెడ్డి, జులై 30:* రహదారి ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందించి ప్రాణాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘రహవీర్ (Rah-Veer)’ మరియు పీఎం రహత్ (PM RAHAT) పథకాలను జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు . గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఆశిష్ సంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పథకాల అమలు తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రహదారి ప్రమాదం జరిగిన వెంటనే ప్రజలు స్పందించి బాధితులను సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ప్రమాద బాధితులను ‘గోల్డెన్ అవర్’లోపు ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.25,000 నగదు బహుమతి అందజేస్తామని తెలిపారు. అలాగే రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి రూ.1.5 లక్షల వరకు ఉచిత (క్యాష్‌లెస్) వైద్యం అందించే పీఎం రహత్ పథకం అమలులో ఉందని వెల్లడించారు.

*PM RAHAT పథకం*
(Road Accident Victim Hospitalisation and Assured Treatment)

ముఖ్య ప్రయోజనాలు
✔ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స
✔ ప్రమాదం జరిగిన తేదీ నుండి 7 రోజుల వరకు ఉచిత వైద్యం
✔ గరిష్టంగా ₹1.5 లక్షల వరకు వైద్య ఖర్చులు భరిస్తారు
✔ జాతీయ రహదారులు మాత్రమే కాదు – ఏ రహదారిపై జరిగిన ప్రమాదానికైనా వర్తింపు

లబ్ధిదారులు :రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి బాధితుడు

*RAH-VEER పథకం (Good Samaritan Reward Scheme)*

*ముఖ్యాంశాలు*

✔ ప్రమాద బాధితుడికి వెంటనే సహాయం చేసిన వారికి 25,000 ప్రోత్సాహం
✔ పోలీసులు లేదా కోర్టుల ఇబ్బందుల భయం అవసరం లేదు
✔ సహాయం చేసిన వారి వ్యక్తిగత హక్కులకు చట్టపరమైన రక్షణ
✔ ఒక వ్యక్తి సంవత్సరానికి గరిష్టంగా 5 సార్లు బహుమతి పొందవచ్చు
లబ్ధిదారులు: ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి చేర్చిన సహాయకుడు

*అప్ప్రిసియేషన్ కమిటీ సమీక్షా సమావేశం*
ఈ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించగా, పోలీసు సూపరింటెండెంట్, జిల్లా రవాణా అధికారి,T సంతోష్ కుమార్,జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) వేంకటేశం తదితరులు పాల్గొన్నారు.
🏠 Home