జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట నేడే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసన ఉదయం 11 గంటలకు టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు *** వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) పోరుబాట పట్టింది. దీర్ఘకాలికంగా పెండింగ్ల
జర్నలిస్టుల సమస్యలపై పోరుబాట
నేడే అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద బహిరంగ నిరసన
ఉదయం 11 గంటలకు
టీడబ్ల్యూజేఎఫ్ పిలుపు
*****************
హాయ్ 🙋♂️
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) పోరుబాట పట్టింది.
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉదయం 11 గంటలకు బహిరంగ నిరసనకు పిలుపునిచ్చింది. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇండ్లస్థలాలు, హెల్త్ కార్డులతోపాటు ఉచిత బస్సు, మెట్రో పాసులను వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.అక్రిడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, అందులో తీవ్ర జాప్యం జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో జిల్లాల్లో పూర్తిస్థాయిలో అక్రెడిటేషన్ ఇవ్వలేదు. ఒకే యూనియన్కు చెందిన వాళ్లను అక్రిడిటేషన్ కమిటీల్లో నియమించడం మూలంగా నియంతృత్వం రాజ్యమేలుతోంది. ఏకపక్షంగా కార్డులు జారీచేస్తున్నారు.గత 40 ఏండ్లుగా జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వలేదు. వెంటనే ఆ ప్రక్రియ చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ కార్డులు ఇవ్వాలి.ఈసమస్యలను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే బహిరంగ నిరసన కార్యక్రమానికి టీడబ్ల్యూజేఎఫ్ పిలుపునిచ్చింది.అలాగే ఆర్టీసీ, మెట్రోలలో ప్రయాణాన్ని ఇక నుంచి పూర్తిస్థాయిలో ఉచితంగా ఇవ్వాలని కోరింది.అలాగే రైల్వే పాసులను పునరుద్ధరించేలా యూనియన్ ప్రభుత్వం పై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరింది.ఈ బహిరంగ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫెడరేషన్ శ్రేణులతోపాటు జర్నలిస్టులకు విజ్ఞప్తి చేసింది. ఈ సమస్యలపై హైదరాబాద్లోని సమాచార, పౌరసంబంధాల శాఖ కార్యాలయం సమాచార్ భవన్ వద్ద ఈనెల 15 బుధవారం ఉదయం 11 గంటలకు బహిరంగ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు నాయకత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.
పి రాంచందర్
యాక్టింగ్ ప్రెసిడెంట్
బి బసవపున్నయ్య
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
TWJF