*క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : అదనపు కలెక్టర్ గడ్డం నగేష్* ---------------------------- రాజన్న సిరిసిల్ల, వేములవాడ జూలై -10 ---------------------------- వేములవాడ మండలం అనుపురం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు మెర
*క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : అదనపు కలెక్టర్ గడ్డం నగేష్*
----------------------------
రాజన్న సిరిసిల్ల, వేములవాడ జూలై -10
----------------------------
వేములవాడ మండలం అనుపురం సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
శుక్రవారం ఉదయం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, వేములవాడ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అదనపు కలెక్టర్ పరామర్శించారు.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితులను, వారికి అందిస్తున్న చికిత్స గురించి అదనపు కలెక్టర్ సంబంధిత వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యంతో పాటు మందులు, భోజనం క్రమం తప్పకుండా అందించాలని, వారి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని వైద్యులు, సిబ్బందిని అదనపు కలెక్టర్ ఆదేశించారు.
కార్యక్రమంలో జిలా వైద్యాధికారి ఏంజెలినా అల్ఫ్రెడ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, తహసీల్దార్ జయంత్, వైద్యులు, తదితరులు ఉన్నారు.