*పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* *నాణ్యమైన బోధనతో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలి* *ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల అంకితభావమే ప్రభుత్వ పాఠశాలలకు బలమైన గుర్తింపు* *ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లక
*పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి : జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష*
*నాణ్యమైన బోధనతో విద్యార్థుల నమోదు పెంచేందుకు ప్రత్యేక కృషి చేయాలి*
*ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల అంకితభావమే ప్రభుత్వ పాఠశాలలకు బలమైన గుర్తింపు*
*ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*
---------------------------
పెద్దపల్లి, జూలై-10
----------------------------
జిల్లాలో పూర్వ ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేసి, చిన్నారులకు నాణ్యమైన విద్యా పునాదులు అందించేందుకు ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు అంకితభావంతో పనిచేయాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* సూచించారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లకు నిర్వహించిన ఒకరోజు ఓరియంటేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష* మాట్లాడుతూ, జిల్లాలో గత విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది 63 పాఠశాలల్లో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో 48 పాఠశాలలకు విస్తరించడంతో ప్రస్తుతం మొత్తం 110 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వచ్చిందని పేర్కొన్నారు.
ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ల పట్టుదల, అంకితభావం, క్రమశిక్షణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపునకు కీలకమని అన్నారు. చిన్నారులకు నాణ్యమైన విద్యతో పాటు ఆటలు, పాటలు, కార్యాచరణ ఆధారిత బోధన అందించడం ద్వారా తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతుందని తెలిపారు.
ప్రతి రోజు సమయానికి పాఠశాలకు హాజరవుతూ చిన్నారులతో ఆసక్తికరమైన విద్యా కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంపు కోసం అవసరమైన సహకారం ఏదైనా ఉంటే జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తున్న ఓరియంటేషన్ కార్యక్రమంలో వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నామని, ఈ శిక్షణ ద్వారా ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు చిన్నారులకు బలమైన విద్యా పునాదులు వేసే విధంగా పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి శారద, జిల్లా అకాడమిక్ అధికారి షేక్,రిసోర్స్ పర్సన్స్, ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్లు పాల్గొన్నారు.