Banner
Watermark
రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో నిర్మాణ పనుల పరిశీలన
📅 10 June 2026, 04:35 PM ✍️ admin
News Image
రుద్రంగి, జూన్ -10

రుద్రంగి మండలం గైదిగుట్ట తండాలో ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (గర్ల్స్) విద్యాలయం భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

రుద్రంగి మండలం గైదిగుట్ట తండా ట్రైబల్ వెల్ఫేర్ అప్ గ్రేడెడ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ (గర్ల్స్) భవన నిర్మాణ పనులు కొనసాగుతుండగా, బుధవారం జిల్లా కలెక్టర్ తరగతి గదులు, హాస్టల్ భవనం, ఇతర నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్, అధికారులు మొక్కలు నాటారు.

జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. త్వరితగతిన వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

పరిశీలనలో రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి సంగీత, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసాచారి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home