కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలోని గ్రామాల ప్రజలకు వెసులు బాటు కల్పించాలని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ మండల నాయకులు భూక్య అమ్మి బాపూరావు కోరారు
📅 14 May 2026, 03:56 PM
✍️ admin
కడెం నేటి ప్రభాత దర్శిని మే 14 నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి భుక్యా జాన్సన్ నాయక్ ఆదేశాల మేరకు కవ్వాల్ టైగర్ జోన్ లోని కడెం మండలం పాండాపూర్ టోల్గేట్ ఇటీవలే ప్రారంభమైంది అక్కడి ప్రజలకు ఇబ్బందులు కలిగించే అనేక సమస్యలు ఉన్నాయని టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు భూక్య అమ్మి బాపు రావ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టోల్గేట్కు కనీసం ఒక కిలోమీటర్ల దూరంలో నుండే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అలాగే స్పీడ్ బ్రేకర్లు ఉన్న ప్రదేశం లో స్పష్టమైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజల భద్రత దృష్ట్యా అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని అదేవిధంగా రోడ్ ఫోర్ వే లైన్ లో. విధానంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సేవలందించేందుకు చెక్ పోస్ట్ వద్ద వద్ద ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని అటవీశాఖ అధికారులు ప్రజల ప్రాణాలతో ఆటలు ఆడుకో రాదని ప్రజల బాధ్యత భద్రతను దృష్టిలో ఉంచుకొని వెంటనే తగిన చర్యలు చేపట్టాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నాయకులు గ్రామస్తులు కలిసి చెక్ పోస్ట్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చల్లని త్రాగునీరు కూడా అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు తదితరులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అమ్మి బాపూరావు టిఆర్ఎస్ పార్టీ కడెం మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు