PMSHRI ZPHS కొత్తపల్లి (H)లో ఘనంగా 'బడిబాట' కార్యక్రమం
కొత్తపల్లి, మే 14:99 రోజుల ప్రజా పాలన లో విద్యా వారోత్సవాలలో భాగంగా కొత్తపల్లి (H) లోని PMSHRI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 'ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట' కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ACLB శ్రీమతి డా. అశ్విని తానాజి వాకడే గారు ప్రారంభించారు.18 వ వార్డ్ కార్పొరేటర్ శ్రీ వాసాల రమేష్ గారు జెండా ఊపి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ర్యాలీ లో గ్రామములో, వీక్లీ మార్కెట్ ద్వారా బస్ స్టాండ్ వరకు జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో వాసాల రమేష్ గారు మాట్లాడుతూ, బడి వయసు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడమే బడిబాట ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అత్యాధునిక వసతులను, నాణ్యమైన విద్యను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డీఈ ఓ ACLB డా శ్రీమతి అశ్విని తానాజీ వాకాడే గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, నాణ్యమైన విద్యను అందిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందే ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం మరియు ఇతర సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు.ఈ విద్యా సంవత్సరంలో ఎక్కువ మంది విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడం లో మీరందరు పాఠశాల ప్రధానోపాద్యులకు ఉపాధ్యాయులకు సహకారం అందించాలని కోరారు
ఈ కార్యక్రమంలో జిల్లా ప్లానింగ్ కో-ఆర్డినేటర్ శ్రీ మిల్కూరి శ్రీనివాస్ గారు, 17వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కవిత చంద్రశేఖర్ గారు, 18వ వార్డు కార్పొరేటర్ శ్రీ వాసాల రమేష్ గారు, కొత్తపల్లి MEO శ్రీ తుమ్మ ఆనందం గారు, మరియు శ్రీ బండ గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కన్నం రమేష్ గారు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇట్లు,
ప్రధానోపాధ్యాయులు,
PMSHRI ZPHS కొత్తపల్లి (H).