ధాన్యం కొనుగోలు ప్రక్రియ పరిశీలన లో భాగం గా కలెక్టర్ విస్తృత పర్యటన లు
మే 14
జనగాం జిల్లా లో ఏర్పాటు చేసిన అన్నీ కేంద్రాలలో.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం కావాలని, ప్రతీ అధికారి రోజుకి పది కేంద్రాలని సందర్శించి కొనుగోలు ప్రక్రియ సాఫిగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు
గురువారం...
రఘునాథ్ పల్లి మండలం ఖిలా షాపురం ఎర్రగట్టు తండా, మేకల గట్టు
నర్మే ట్ట మండలం నర్మే ట్ట గ్రామం, వెల్డండా ,జనగాం మండలం వెంకీర్యాల లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా సందర్శించి... ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు
ఈ సందర్బంగా కలెక్టర్ ...ఇప్పటివరకు
ఎంత ధాన్యాం వచ్చింది, ఎంత కొనుగోలు చేశారు , ఎంత మంది హమాలీ లు ఉన్నారు,సరిపడా గన్ని బ్యాగ్ లు, టార్ఫాలీన్ లు ఉన్నాయా, లారీ లు వచ్చాయా లేదా,లోడింగ్ కి ఎంత టైం తీసుకుంటున్నారు, ట్యాబ్ ఎంట్రీ ఎలా చేస్తున్నారు అని తదితర వివరాలను కలెక్టర్ కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ....
తేమ శాతం రాగానే.. ఎలాంటి ఆలస్యం లేకుండా కొనుగోలు అవ్వాలని... ప్రతీ కేంద్రం కి ఒక ట్రక్ ని కేటాయించడం జరిగిందని... సరిపడా హమాలీలను పెట్టుకొని కొనుగోలు అయిన ధాన్యాన్ని ట్యాగ్ చేసిన మిల్లు లకు తరలించాలన్నారు
మిల్ కి వెళ్లే ట్రక్ లో కేంద్రానికి సంబందించిన ఒకరిని కూడా పంపించి.... అక్కడ ధాన్యాం త్వరగా ఆన్ లోడ్ అయ్యేలా చూసుకోవాలన్నారు
అలాగే opms లో ఎప్పటికప్పుడు కొనుగోలు వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు
ప్రతీ సెంటర్ నిర్వాహకులు, ఏపీఎం, సీసీ లు బాధ్యత యుతంగా పని చేసి ధాన్యాం కొనుగోలు లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు
.
కొనుగోలు, రవాణా అంశాలలో నిర్లక్ష్యం గా వ్యవహరించే వారి మీద కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు
సివిల్ సప్ప్లై, కో ఆపరేటివ్, వ్యవసాయ, రవాణా తదితర శాఖల అధికారులు ప్రతీ రోజూ కనీసం 10 సెంటర్ లను సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు