*నందిమేడారం ఆసుపత్రి లో ఓపి సేవలు ప్రారంభం
📅 12 May 2026, 03:58 PM
✍️ admin
ప్రచురణార్థం డిసిహెచ్ఎస్ కార్యాలయము, పెద్దపల్లి:
5 కోట్ల రూపాయలతో నిర్మించబడిన 30 పడకల నంది మేడారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను గౌరవనీయులైన మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం నేటి నుండి OP సేవలు ప్రారంభించబడినట్లు సూపరింటెండెంట్ డా. శ్రీధర్ గారు ప్రకటనలో తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో పూర్తి స్థాయిలో అన్ని వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. కావున చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు.