Banner
Watermark
నేటి ప్రభాత దర్శిని గురుకుల విద్యార్థులకు సన్మానం
📅 30 April 2026, 03:15 PM ✍️ admin
News Image

వార్తలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న మందాడి హని అనే విద్యార్థిని ప్రతిభ కనబరిచి సోసైటీ స్థాయిలో రెండవ ర్యాంకు సాధించింది. ఆమె సాధించిన ఈ విశిష్ట విజయాన్ని గుర్తిస్తూ ఈ రోజు సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థ హైదరాబాదులో మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, గురుకుల విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. మందాడి హని సాధించిన విజయం ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తుందని అభినందించారు.
పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు తల్లిదండ్రులు హని విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ, ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
🏠 Home