Banner
Watermark
నిరంతర కృషి పట్టుదలకు ప్రతీక ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
📅 23 April 2026, 11:17 AM ✍️ admin
News Image
గురువారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై, జ్యోతి ప్రజ్వలన గావించి, మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సగర వంశీయులైన భగీరథ మహర్షి గంగా నదిని స్వర్గం నుంచి భూమిపైకి తీసుకువచ్చిన గొప్ప తపస్వి అని కొనియాడారు.

భగీరథుడు పట్టుదలకు ప్రతీక అని, ఏదైనా సాధించాలనే సంకల్పానికి, నిరంతర కృషికి "భగీరథ ప్రయత్నం" ఒక గొప్ప స్ఫూర్తి అని తెలిపారు.

భగీరథ మహర్షి త్యాగం, పట్టుదల ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

అనంతరం అధికారులు, కుల సంఘాల ప్రతినిధులు, కార్యదర్శులు, అధ్యక్షులు, తదితరులు ఆయన చిత్రపటానికి అంజలి ఘటించి, నివాళులు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి ఎన్. ఎల్. నరసింహ రావు, ఏబీసీడీఓ రవీందర్, కుల సంఘాల నాయకులు, పెద్దలు, ఐడిఒసి సిబ్బంది, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home