Banner
Watermark
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి:: జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష *ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్
📅 20 April 2026, 04:04 PM ✍️ admin
News Image
అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు.

సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు.


రామగిరి మండలం 8 ఇంక్లైన్ కాలనీ కు చెందిన కే.రాజమ్మ 69/ఈ సర్వే నెంబర్లు గల 26 గంటల భూమి ఉందని, తన భూమిని తప్పుడు కాగితాలతో అమ్మినట్లు కాగితాలు చూపించి పట్టా చేయించుకోవాలని చూస్తున్నారని తన సంతకాలు ఫోర్జరీ చేశారని, తన పట్టా ఎవరి పేరు మీద చేయవద్దని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డిఓ పెద్దపల్లి కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

జూలపల్లి మండలం కుమ్మరి కుంట గ్రామానికి చెందిన ఏ. భూమయ్య తనకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయిందని , ఇంటి నిర్మాణానికి 10 నుంచి 12 లక్షలు ఖర్చు అవుతుందని, అదనంగా డబ్బులు పెట్టే కట్టుకుని స్తోమత తనకు లేదని, ప్రభుత్వం అందించే ఐదు లక్షల రూపాయలతో రేకుల షెడ్డు నిర్మాణం కోసం వెసులుబాటు కల్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పీడీ హౌసింగ్ కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఎస్. మదన్ మోహన్ తనకు ఆరు సంవత్సరాల క్రితం రైలు ప్రమాదంలో ఒక కాలు పోయిందని, తనకు ఇంతవరకు దివ్యాంగుల పెన్షన్ మంజూరు కాలేదని, తనకు దివ్యంగుల పెన్షన్, అంత్యోదయ రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పౌరసరఫరాల శాఖ అధికారిక రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది
🏠 Home