ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెహ్రూ పార్క్ సమీపంలో పోలీస్ శాఖ రవాణా శాఖ సంయుక్తంగా స్కూలు విద్యార్థులతో మానవహారం నిర్మించి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేపించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డిసిపి రాజమహేంద్ర నాయక్, ఏసిపి పండరి చేతన్ నితిన్, సీఐ సత్యనారాయణ రెడ్డి డి టి ఓ శ్రీనివాస్ గౌడ్ ఎస్ ఐ చెన్నకేశవులు మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.