Banner
Watermark
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజావాణికి 270 దరఖాస్తుల రాక
📅 13 April 2026, 04:41 PM ✍️ admin
News Image
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 270 దరఖాస్తుల రాగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి.. వాటిని పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లా ప్రణాళిక అధికారి, సీ,డీ,ఈ సెక్షన్, తహసీల్ ఆఫీస్ రుద్రంగి, తహసీల్ ఆఫీస్ సిరిసిల్ల, అటవీ శాఖ, జిల్లా ఎక్సైజ్ అధికారి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఈఓ, ఆర్ అండ్ బీ, జీజీహెచ్ సిరిసిల్ల, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి, జిల్లా పశు సంవర్ధక అధికారి, జిల్లా మైనింగ్ అధికారి, సబ్ రిజిస్టార్ సిరిసిల్ల, డీపీఆర్ఓ, జిల్లా వ్యవసాయ అధికారి, సహకార అధికారికి ఒకటి చొప్పున, జిల్లా పౌర సరఫరాల అధికారి, నీటి పారుదల శాఖ, జిల్లా వైద్యాధికారి, తహసీల్ ఆఫీస్ చందుర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 2 చొప్పున, జిల్లా విద్యాధికారి, తహసీల్ ఆఫీస్ వేములవాడ, బోయినపల్లికి 3 చొప్పున, ఉపాధి కల్పన అధికారి, తహసీల్ ఆఫీస్ గంభీరావుపేట, ఆర్డీఓ వేములవాడకు 4 చొప్పున, విద్యుత్ శాఖ, ఎస్పీ కార్యాలయం, తహసీల్ ఆఫీస్ ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ కు 5 చొప్పున, జిల్లా సంక్షేమ అధికారి, తహసీల్ ఆఫీస్ వేములవాడ రూరల్, కోనరావుపేట, ఆర్డీఓ సిరిసిల్లకు 6 చొప్పున, తహసీల్ ఆఫీస్ తంగళ్ళపల్లి, ఇల్లంతకుంటకు -7 చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 8, జిల్లా పంచాయతీ అధికారికి 13, గృహ నిర్మాణ శాఖకు 68, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారికి 73 వచ్చాయి.

ప్రజావాణిలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఆర్డీఓలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, హౌసింగ్ పీడీ వెంకట మాధవ రావు తదితరులు పాల్గొన్నారు
🏠 Home