పేదల అన్నదానానికి సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు పేదవారికి ఒక్క పూటైనా కడుపు నిండా భోజనం అందిద్దాం మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్
అన్నపూర్ణే! సదాపూర్ణే! శంకర ప్రాణ వల్లభే! జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి
ట్రస్టు ఆధ్వర్యంలో దాతలు అందిస్తున్న సహకారంతో 1817 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున లక్ష్మీ గణపతి, రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా చిరంజీవి శ్రేయాన్ష్ పుట్టినరోజు సందర్భంగా గోదావరిఖని 8 ఇంక్లైన్ వాస్తవ్యులు చందుపట్ల మధుకర్ రెడ్డి అంజలి దంపతులు, దండ రాజిరెడ్డి సునీత దంపతులు మరియు కుటుంబ సభ్యులు తాత గారి జ్ఞాపకార్థం జగిత్యాల వాస్తవ్యులు రుద్రంగి రాఘవేంద్ర శర్మ సుచిత్ర దంపతులు డాక్టర్ జువ్వాడి వెంకటేశ్వర రావు స్నేహాలత దంపతులు ప్రతాప స్వప్న సంపత్ దంపతులు నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు రామడుగు శ్రీలత కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్చంద్ర దంపతులు శిరీష సాయిచంద్ర దంపతులు శర్వాణి రవిచంద్ర దంపతులు హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయి కృష్ణ ఉన్నారని మీయొక్క పుట్టిన రోజు పెళ్ళిరోజు మరియు ఇతరత్ర కార్య క్రమాలకు పేదలకు అన్నార్తులకు ఒక్కపూట భోజనం అందించడానికి సహకారం అందించే దాతలు ట్రస్టు సభ్యులను గాని 9246939388 నంబరుకు సంప్ర దించాలని, ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు.
ఈ కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు నాగుల చంద్రశేఖర్ పొలాస రాజేందర్ సగ్గు రాహుల్ పసుల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు