Banner
Watermark
తేది 08-04-2025 సేఫ్ మదర్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహణ
📅 08 April 2026, 04:06 PM ✍️ admin
News Image
ఈరోజు ప్రజాపాలన ప్రగతి పథకాలలో భాగంగా సేఫ్ మదర్ డే కార్యక్రమం కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ గారు మరియు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ గారు పాల్గొని అడిషనల్ కలెక్టర్ గారు ప్రసంగిస్తూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సంరక్షణ ప్రతి కుటుంబం మరియు సమాజం యొక్క బాధ్యత అని పేర్కొన్నారు. తల్లి ఆరోగ్యం బాగుంటేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.

జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ప్రసంగిస్తూ గర్భిణీలు గర్భధారణ సమయంలో నిర్దిష్టంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, సమతుల్య పోషకాహారం తీసుకోవాలని, వైద్యుల సూచనలు పాటించాలని సూచించారు. ప్రభుత్వము గర్భిణీ స్త్రీల మరియు శిశువుల ఆరోగ్య రక్షణ కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని, ప్రజలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పద్మజ మాట్లాడుతూ గర్భిణీలకు సురక్షిత మాతృత్వం, ప్రసూతి ముందు మరియు తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ వీరారెడ్డి, DWO సరస్వతి,పి ఓ ఎం హెచ్ న్ డాక్టర్ సన, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, తల్లులు మరియు ఇతర ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Sd/-
జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి కరీంనగర్
🏠 Home