Banner
Watermark
పేదప్రజల కోసం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఏఎంసీ చైర్మన్ షేక్ సబేర బేగం
📅 06 April 2026, 04:15 PM ✍️ admin
News Image
తాటి కమ్మల గుడిసెలో ఉండే తమకు సి ఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం వల్లే తాం ఇందిరమ్మ ఇళ్ళు కట్టుకున్నామని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్దిదారులు

పేదప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని
ఏఎంసీ చైర్మన్ షేక్ సబేర బేగం అన్నారు,
ఎల్లారెడ్డిపేట మండలం బాకూర్ పల్లి తండా గ్రామపంచాయతీ కి మంజూరైన 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న మురికి కాలువ నిర్మాణానికి ఏఎంసీ చైర్మన్ షేక్ సభేరా బేగం స్థానిక సర్పంచ్ అజ్మీరా రాజు నాయక్, సర్పంచుల పోరం మండల అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య లు కలిసి సోమవారం టెంకాయలు కొట్టి భూమి పూజ చేశారు,
అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులైన గుగులోత్ పద్మ భాస్కర్ నాయక్ మాలోత్ లక్ష్మి పూల్యా నాయక్ లు నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశానికి సిద్ధం చేసిన ఇందిరమ్మ ఇళ్ళను సోమవారం రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు,
ఈ సందర్భంగా మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు మళ్లీ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారన్నారు,
ఎల్లారెడ్డిపేట మండలానికి మంజూరైన 642 ఇందిరమ్మ ఇళ్ళలో 500 పై చిలుకు ఇండ్లు నిర్మాణం జరుగుతున్నాయన్నారు, 63 ఇల్లు క్యాన్సల్ అయినట్లు ఆయన పేర్కొన్నారు అట్టి ఇందిరమ్మ ఇళ్ళు మళ్ళీ మంజూరయ్యాయని వాటిని ఇల్లు లేని నిరుపేదలకు మంజూరు ఇవ్వడం జరుగుతుందన్నారు
బాకూరుపల్లి సర్పంచ్ రాజు నాయక్ తమతో కలిసి వస్తే మరింత గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చునన్నారు,
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని ఆరుగ్యారెంటీలను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలతో పాటు మహిళలను కోటీశ్వరుల చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు విత్తన విక్రయ కేంద్రాలు రైస్ మిల్లులు అనేక పరిశ్రమలను ఇవ్వడం జరుగుతుందన్నారు, బిఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదని రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన వెంటనే రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తూనన్నారని ఉన్నత వర్గాలతో సమానంగా పేదవాడు కూడా అన్నం తినాలనే సదుద్దేశంతో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సన్నబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి ఒక్కొకరికి ఆరు కిలోల చొప్పున ఇస్తున్నారని ఆయన గుర్తు చేశారు,
అందుకే పొద్దుగాల లేవగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖం చూడాలని చూస్తే అన్నం పుడుతుందన్నారు ప్రతి ఒక్కరు తిన్న రేవును తలవాలని పెద్దలు అందుకే అన్నారన్నారు
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చాలామంది యువకులు వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయన అన్నారు
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు మాలోత్ పుల్యా లక్ష్మి గుగులోత్ భాస్కర్ పద్మ లు మాట్లాడుతూ తాటి కమ్మల గుడిసెలో ఉన్న తమకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం వల్లే తాము ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోగలిగినామని సంతోషం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు,
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి పంపిన నూతన వస్త్రాలను అందజేశారు, ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్తయ్య ఉప సర్పంచ్ మాలోత్ మోహన్ నాయక్ , పంచాయతీ కార్యదర్శి భరత్, ఇందిరమ్మ ఇళ్ల ఏఈ చైతన్య , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్ బాయ్ ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి రాజన్నపేట సర్పంచ్ బాపురెడ్డి , తిమ్మాపురం గుండారం ఉపసర్పంచ్ లు జజ్జరి దేవేందర్ ముదిరాజ్, ఏఎంసి డైరెక్టర్లు బాలయ్య మండే శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి శ్రీనివాస్ రెడ్డి వంగ గిరిధర్ రెడ్డి బండారి బాల్రెడ్డి నంది కిషన్ దండు శ్రీనివాస్ ముదిరాజ్, వంగ శ్రీకాంత్ రెడ్డి, వరద బాబు , వార్డు మెంబర్లు రమావత్ రమేష్ జమున గంగవ్వ మంగ గ్రామస్తులు శంకర్ కిషన్ భాస్కర్ రాములు తదితరులు పాల్గొన్నారు,
🏠 Home