Banner
Watermark
మంచినీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్ పర్సన్
📅 20 March 2026, 03:33 PM ✍️ admin
News Image
రాజన్న సిరిసిల్ల జిల్లా (నేటి ప్రభాత దర్శిని) ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శుక్రవారం మంచినీటి శుద్ధి యంత్రాన్ని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఎస్కే సాబేరా బేగం ప్రారంభించారు ఈ సందర్భంగా మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ గతంలో మాజీ ఎంపీ ప్రస్తుత రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వాటర్ ఫిల్టర్ ని ఇవ్వగా అది చెడిపోవడంతో రెండు లక్షల రూపాయలతో కొత్తగా వాటర్ ఫిల్టర్ తో పాటు కూల్ బబుల్ యంత్రాన్ని కూడా ఏర్పాటు చేశామన్నారు మూడు సంవత్సరాల పాటు ఈ వాటర్ ఫిల్టర్ ను లీజుకి ఇవ్వడం జరిగిందని తక్కువ ధరకే గ్రామ ప్రజలకు అందించే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేశామని గ్రామపంచాయతీ పాలకవర్గం సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మోతే మధుసూదన్ రెడ్డి డిప్యూటీ తహసిల్దార్ ఎలుసాని ప్రవీణ్ కుమార్. వార్డు సభ్యులు సాయి కృష్ణ ఎస్కే సమాద్. అనరాసి నరసింహులు జెల్ల రవి. అంబటి పద్మ నాయకులు సిరిపురం మహేందర్ దొమ్మాటి రాజు తదితరులు పాల్గొన్నారు
🏠 Home