Banner
Watermark
ఇల్లంతకుంట, మార్చి – 17ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో ఇల్లంతకుంట, బోయినపల్లి, కోనరావుపేట, వేములవాడ,గంభీరావుపేట మండలాల్లో 40 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్
📅 17 March 2026, 03:24 PM ✍️ admin
News Image
ఆయిల్ పామ్ పంట సాగుకు రైతులు ముందుకు రావాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు నిచ్చారు.

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఇల్లంతకుంట మండలం వంతడుపుల, అనంతారం, రేపాక, ఓబులాపూర్, బోయినపల్లి మండలం విలాసాగర్, మల్కాపూర్, మర్లపేట, కోనరావుపేట మండలం ఎగ్లాస్పూర్, వేములవాడ, గంభీరావుపేట మండలం శ్రీగాద గ్రామాల్లో మొత్తం 40 ఎకరాల్లో ఆయిల్ పామ్ మొక్కల మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఇల్లంతకుంట మండలం వంతడుపులలో మంగళవారం కార్యక్రమానికి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగుతో అధిక దిగుబడి, లాభాలు వస్తాయని తెలిపారు. ఆయిల్ పామ్ లో అంతర పంటలుగా కూరగాయలు, మొక్క జొన్న, పూల మొక్కలు ఇతర పంటలు సాగు చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే డ్రిప్ ఇరిగేషన్, ఇతర సబ్సిడీలు ఉన్నాయని తెలిపారు. పంటకు మంచి మద్దతు ధర వస్తుందని వివరించారు. పంట ఉత్పత్తి సేకరణకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రతి మండలం నుంచి కొనుగోలు చేస్తారని తెలిపారు. ఒకే పంట సాగు చేయకూడదనే ఉద్దేశంతో, ఆయిల్ పామ్ సాగు పెంచేందుకు ఇప్పటికే పీఏసీఎస్ లలో రైతులకు అవగాహన కల్పించామని, వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులకు లక్ష్యం నిర్దేశించామని తెలిపారు. ఆదర్శనీయమైన రైతులు ముందుకు వస్తున్నారని, మిగతా వారు కూడా సాగు చేయాలని పిలుపు ఇచ్చారు. జిల్లాకు దగ్గరలోనే సిద్దిపేట జిల్లాలోని నర్మెట్ట వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఈ నెల 22 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించ నున్నారని వెల్లడించారు.

కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, తహసీల్దార్ ఫరూఖ్, ఎంపీడీఓ శశికళ తదితరులు ఉన్నారు.
🏠 Home